కరోనా వ్యాప్తి నివారణకు జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రజలు స్వచ్ఛందంగా.. కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ప్రజలు ఉదయం 7 గంటల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. రద్దీగా ఉండే శివాలయం కూడలి, గాంధీ రోడ్డు, మైదుకూరు రోడ్డు వెలవెలబోతున్నాయి. పట్టణంలో బంగారం, వస్త్ర, వ్యాపార దుకాణాలను మూసివేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలు అన్నీ నిలిపివేశారు.
ప్రొద్దుటూరులో జనతా కర్ఫ్యూ - కడపలో జనతా కర్ఫ్యూ
ప్రధాని పిలుపు మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూని పాటిస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవలు తప్పా అన్నీ రద్దయ్యాయి.
![ప్రొద్దుటూరులో జనతా కర్ఫ్యూ Janata curfew continues at Prodduturu in Kadapa district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6501222-939-6501222-1584859942435.jpg)
Janata curfew continues at Prodduturu in Kadapa district.