ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీ విముక్త ఏపీ కోసం అంతా ఏకం కావాలి: నాదెండ్ల మనోహర్‍ - Janasena PAC Chairman Nadendla Manohar

Janasena PAC Chairman: వైకాపా విముక్త రాష్ట్రం కోసం అందరూ కలిసి పోరాడాలని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‍ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు. వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు జనసేన నాయకులు ఘనస్వాగతం పలికారు..

నాదెండ్ల మనోహర్‍
Nadendla Manohar

By

Published : Nov 18, 2022, 8:23 PM IST

Janasena PAC Chairman Nadendla Manohar: వైఎస్సార్‌ కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సంవత్సరమవుతున్నా.. నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జనసేన పీఏసీ ఛైర్మన్‍ నాదెండ్ల మనోహర్‍ అన్నారు. కడప జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు జనసేన నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఆరోపించారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగిన ఘోరంపై పది రోజుల తరువాత ఆయన స్పందించారని నాడెండ్ల గుర్తు చేశారు. మూడు నెలల్లో ఇంటి తాళాలు ఇస్తామన్న సీఎం హామీ నెరవేరలేదని ఎద్దెవా చేశారు. అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిస్థితిపై జనసేన అధినేత పవన కల్యాణ్​కు నివేదిక ఇస్తామన్నారు. మోదీతో పవన్ భేటీ నిర్ణయాలను జనసేన వెల్లడించదని... భేటీపై వస్తున్న రూమర్స్ అర్థరహితమన్నారు.

వైకాపా విముక్త రాష్ట్రం కోసం పోరాడుతాం: నాదెండ్ల మనోహన్‌

పెడన ఘటనపై స్పందించిన నాదెండ్ల మనోహర్‍:కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ అనుచరులు వీరంగం సృష్టించడంపై నాదెండ్ల మనోహర్‍ స్పందించారు. పోలీస్​స్టేషన్​లో పోలీసుల ముందే జనసేన కార్యకర్తలపై దాడికి దిగారని ఆరోపించారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఎస్​ఐ, పోలీసు సిబ్బంది ఆపకుండా చోద్యం చూశారని నాదెండ్ల వెల్లడించారు. పోలీసులు చూస్తుండగానే దర్జాగా దౌర్జన్యం చేసి వెళ్లిపోయారని తెలిపారు. పోలీసులు మాత్రం జనసేన కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details