ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సృజనాత్మకతకు ప్రోత్సాహం... విద్యార్థుల్లో ఉత్సాహం - ఇన్స్​స్పైర్ మానక్ 2019 న్యూస్

విద్యార్థుల్లోని సృజనాత్మకత, ఆలోచనా శక్తిని వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్ ఫెయిర్, ఇన్​స్పైర్ మానక్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. పిల్లల్లో వైజ్ఞానిక ఆలోచనలు పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి. కడప జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సైన్స్ ఫెయిర్​లో విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను మూడు రోజుల పాటు (23,24,25 తేదీల్లో) ప్రదర్శించనున్నారు.

Inspire manak programme in kadapa district
సృజనాత్మకతకు ప్రోత్సాహం... విద్యార్థుల్లో ఉత్సాహం

By

Published : Jan 25, 2020, 12:04 AM IST

సృజనాత్మకతకు ప్రోత్సాహం... విద్యార్థుల్లో ఉత్సాహం

నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టి, బట్టీ చదువులు చదవడం వల్ల విద్యార్థుల్లో ఆలోచనా శక్తి తగ్గిపోతోంది. పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. వాటిని నియంత్రించి విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం డిపార్ట్​మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్​ఐఎఫ్​) సంయుక్తంగా సైన్స్ ఫెయిర్, ఇన్​స్పైర్ మానక్​లు నిర్వహిస్తున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ... విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే మరిన్నీ ఆవిష్కరణలు వెలుగు చూస్తాయంటున్నారు ఉపాధ్యాయులు.

కడప జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి దాదాపుగా రెండు వేలకు పైగా అప్లికేషన్లు రాగా అందులో 483 నమూనాలను జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. ఎంపికైన ఒక్కో విద్యార్థికి పదివేల రూపాయలను ఎన్ఐఎఫ్ నగదు ప్రోత్సాహకం అందిస్తుందని ఆ సంస్థ ప్రాంతీయ అధికారి వెంకటక్రిష్ణా రెడ్డి తెలిపారు.

తమకు సరైన ప్రోత్సహం అందిస్తే... మరిన్ని ఆవిష్కరణలు చేస్తామంటున్నారు విద్యార్థులు. నిత్యం జరుగుతున్న సంఘటనలు, సమస్యలను పరిశీలించి... వాటిని పరిష్కరించేలా రూపకల్పనలు చేస్తామంటున్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ కార్యక్రమాల పట్ల జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తితో ఉన్నారని డీఈవో శైలజ తెలిపారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే మెుత్తం 483 విద్యార్థులు నుంచి ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. పాఠశాల దశనుంచే విద్యార్థులకు సరైన ప్రోత్సాహం అందిస్తే నూతన ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :పెన్సిల్ కొనపై జాతీయగీతం... తిరుపతి యువకుడి ప్రతిభ

ABOUT THE AUTHOR

...view details