ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

150 కర్ణాటక మద్యం బాటిళ్లు పట్టివేత... ఇద్దరు అరెస్ట్ - రామాపురం చెక్​పోస్ట్ వద్ద అక్రమ మద్యం స్వాధీనం వార్తలు

కడప జిల్లా రామాపురంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేదరపల్లి చెక్​పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కొందరు వ్యక్తులు మద్యం బాటిళ్లు తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు. అనంరతం వారి నుంచి 150 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.

illegal transport of liquor is seazed in rayachoti at kadapa
150 కర్ణాటక మద్యం బాటిళ్లు పట్టివేత... ఇద్దరు అరెస్ట్

By

Published : Nov 23, 2020, 7:01 AM IST


కడప జిల్లా రామాపురంలోని మేదరపల్లి చెక్​పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. రాయచోటి వైపు నుంచి కడప వైపు వేగంగా వెళుతున్న స్కూటర్ అతి వేగంగా చెక్ పోస్ట్ దాటి వెళ్లడంతో పోలీసు సిబ్బంది వెంబడించారు. కొద్ది దూరంలో బైక్ ను వదిలి మద్యం బాటిళ్లతో పరార్ అవుతున్న నల్లగొండు రవిశంకర్, కున్నపులి గంగన్నలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రామాపురం పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామాపురం ఎస్.ఐ మైనుద్దీన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details