ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రచందనం అక్రమ రవాణాకు 'సీసీ'తో చెక్

ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అటవీ శాఖ ప్రధాన కార్యాలయాలు, ప్రధాన రహదారిలోని చెక్ పోస్టులు వద్ద సీసీ కెమెరాలను అమర్చి, క్షేత్ర స్థాయిలో వీటి పనితీరును గమనించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

By

Published : Jun 28, 2019, 2:15 PM IST

ఎర్రచందనం అక్రమ రవాణాకు 'సీసీ'తో చెక్

ఎర్రచందనం అక్రమ రవాణాకు 'సీసీ'తో చెక్

ఎర్రచందనం చెట్లును స్మగ్లర్ల నుంచి రక్షించేందుకు అటవీశాఖ సీసీ కెమెరాలు వినియోగిస్తోంది. కడప జిల్లాలోని అటవీ శాఖ అధికారులు వీటిని వినియోగంలోకి తెచ్చారు. అధికారులు కార్యాలయాల్లో వీక్షించే విధంగా రూపకల్పన చేశారు. క్షేత్ర స్థాయి అధికారుల పనితీరు తెలుసుకునే విధంగా చరవాణిలకు వీటిని అనుసంధానం చేశారు. ప్రొద్దుటూరు, రాజంపేట అటవీశాఖ డివిజన్​లోని 15 రేంజ్ కార్యాలయాలు, ప్రధాన రహదారుల్లోని చెక్ పోస్ట్​ల వద్ద సీసీ కెమెరాలు వినియోగంలో ఉన్నాయని బద్వేలు అటవీశాఖ ప్రాంతీయ క్షేత్ర అధికారి సుభాష్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details