కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలిక పరిధిలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టామని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండి వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని.. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు.
ప్రొద్దుటూరులో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి - proddutoor mla
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు.

ప్రొద్దుటూరులో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ