ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆగిన ప్రగతి రథం... కడప ఆర్టీసీకి భారీ నష్టం - కడప ఆర్టీసీ డిపోకు లాక్​డౌన్ నష్టం

కరోనా దెబ్బకు ఆర్టీసీ చక్రం ఆగిపోవటంతో కడప ఆర్టీసీ డిపో భారీ నష్టం చవిచూసింది. లాక్​డౌన్ వలన జిల్లాలో రవాణా వ్యవస్థ దెబ్బతింది. నిత్యం రద్దీగా ఉండే బస్సు డిపోలు ఇప్పుడు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

heavy loss to kadapa rtc due to lock down
కడప ఆర్టీసీ డిపోకు భారీ నష్టం

By

Published : Apr 24, 2020, 8:39 PM IST

కరోనా వైరస్ దెబ్బకు అన్నీ రంగాలు కుదేలవుతున్నాయి. ప్రతీ రంగం భారీ నష్టాన్ని చవిచూస్తోంది. లాక్​డౌన్ కారణంగా కడప జిల్లా ఆర్టీసీకి 30 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రతి రోజు కోటి రూపాయల ఆదాయం వచ్చే ఆర్టీసీకి లాక్​డౌన్ వలన భారీగానే నష్టం వచ్చింది. ప్రతి రోజు రెండున్నర లక్షల మంది ప్రయాణికులతో 3 లక్షల కిలోమీటర్లు తిరిగే ప్రగతి రథాలు ఎక్కడకక్కడ నిలిచిపోవటంతో జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. బస్సుల రాకపోకతో నిత్యం రద్దీగా ఉండే కడప ఆర్టీసీ డిపో లాక్​డౌన్​ వలన బోసిపోయింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details