కడప జిల్లా ఇడుపులపాయలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో నలుగురు వ్యక్తులకు కరోనా సోకింది. ఒంగోలులో ఏర్పాటు చేయాల్సిన ట్రిపుల్ ఐటీని, భవన నిర్మాణం పూర్తి కాకపోవటంతో.. ఇడుపులపాయలో తాత్కాలికంగా ఉంచారు. ఈ క్యాంపస్లో ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు సిబ్బందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం - ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కరోనా
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కొవిడ్ కేసులు తీవ్ర కలకలం రేపుతోంది. ఇద్దరు విద్యార్థులతో పాటు.. ఇద్దరు సిబ్బందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.

ట్రిపుల్ ఐటీలో కొవిడ్