ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 3, 2021, 3:51 PM IST

Updated : Jul 3, 2021, 10:09 PM IST

ETV Bharat / state

లోడు ఎత్తారు.. వాహనం ఇరుక్కోవడంతో బుక్కయ్యారు..!

బండి నిండా సరుకు నింపారు. తీరా బయటకు వస్తుండగా వాహనం బురదలో ఇరుక్కుపోయింది. వాహనాన్ని బయటకు తీసేందుకు తెల్లవారేసరికి పోరాడారు. చివరకు చేసేందేమి లేక అక్కడే వదిలేసి వెళ్లారు. అధికారులకు సమాచారం అందటంతో బద్వేలు మండల పరిధిలో 32 ఎర్రచందనం దుంగలున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని గమనించిన దుండగులు.. అక్కడి నుంచి పరారయ్యారు.

Red sandalwood  seized
ఎర్రచందనం పట్టివేత

కడప జిల్లా బద్వేలు మండలం కొంగలవీడు వ్యవసాయ పొలాల్లో 25 లక్షల రూపాయల విలువైన 32 ఎర్రచందనం దుంగలు, ఒక మినీ లారీని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల రాకను పసిగట్టిన దుండగులు అక్కడనుంచి పరారయ్యారు. ఎర్రచందనం దుంగలను లోడ్ చేసేందుకు మినీ లారీని నిన్న రాత్రి స్మగ్లర్లు వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్లారు. రాత్రి భారీ వర్షం కురవడంతో వాహనం పొలంలో ఇరుక్కుపోయింది. వాహనాన్ని బయటకు తీసేందుకు తెల్లవారేసరికి పోరాడారు. చివరకు చేసేదేమీ లేక అక్కడే వదిలేసి వెళ్లారు.

ఈ విషయం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన స్మగ్లర్లు అక్కడినుంచి పరారయ్యారు. అక్కడి పరిసరాలను వెతకగా.. 32 ఎర్రచందనం దుంగలు దొరికాయి. వీటితో పాటు మినీ లారీని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇవి రూ.25 లక్షల విలువ ఉంటాయని.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Last Updated : Jul 3, 2021, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details