ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 7, 2021, 10:20 PM IST

ETV Bharat / state

అడవిలో అంటుకున్న మంటలు.. భారీగా వృక్షసంపద దగ్ధం

కడప జిల్లా వెలుగొండ అడవుల్లో కార్చిచ్చు వ్యాపించింది. అడవిలోని జంతుజాలం, విలువైన వృక్షసంపద అగ్నికి ఆహుతవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

wild fire in the forest
గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు

గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో వ్యాపించిన మంటలు..

కడప జిల్లా చిట్వేలు మండలంలోని రాపూరు - చిట్వేల్ రహదారిలో వెలుగొండ అడవి అగ్నికి ఆహుతైంది. చిట్వేల్ - రాపూరు రహదారిలో వెలిగొండల్లో భారీగా కార్చిచ్చు ప్రబలి అడవి దహించుకుపోతోంది. ఎంతో విలువైన ఎర్రచందనంతో పాటు వృక్షసంపద, జంతుజాలం అగ్నికి ఆహుతయ్యాయి.

రహదారి గుండా పోయే గుర్తుతెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడం వల్ల ఈ సంఘటన చోటుచేసుకుందని అక్కడి స్థానికులు అనుమానిస్తున్నారు. గత ఐదారు నెలల నుంచి భారీ వర్షాలు పడడంతో.. అడవి పచ్చని చెట్లతో కళకళలాడుతున్న సమయంలో ఇలా జరగడం పై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details