ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వికటించిన ఐరన్​ మాత్రలు.. విద్యార్థినులకు అస్వస్థత - latest news of kadapa gurukul school

ఐరన్​ మాత్రలు వికటించి 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కడప జిల్లా లింగాలమండలంలో జరిగింది. గురుకుల పాఠశాల విద్యార్థినులు భోజనం ముందు ఐరన్ మాత్రలు తీసుకున్నారు. అనంతరం కడుపునొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాధితులను పులివెందుల ఆసుపత్రికి తరలించారు. అందరికీ వైద్య సేవలు అందించామని.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని... తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు.

food posistion in kadapa dst balayogi school students
చికిత్స పొందుతున్న విద్యార్థులు

By

Published : Jan 3, 2020, 12:03 PM IST

ఐరన్​ మాత్రలు వికటించి విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details