ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే - రైల్వేకోడూరు ఎమ్మెల్యే అన్నదానం న్యూస్

లాక్​డౌన్ కారణంగా కడప జిల్లా​ రైల్వేకోడూరు పట్టణంలోని పేద ప్రజలు పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

పేదల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే
పేదల ఆకలి తీర్చిన ఎమ్మెల్యే

By

Published : Apr 3, 2020, 10:45 AM IST

రైల్వేకోడూరు పట్టణంలోని పేద ప్రజలు పనులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది తిండి లేక అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకులు, స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పట్టణంలోని ధర్మాపురం, గాంధీనగర్, లక్ష్మీపురం, న్యూ క్రిష్ణ నగర్​కు చెందిన పేద ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. లాక్​డౌన్​ కారణంగా కోడూరలోని యువత గత కొన్ని రోజులుగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టి కొంతమంది నిరుపేదల ఆకలిని తీర్చుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details