ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2020, 9:36 PM IST

ETV Bharat / state

'లాక్​డౌన్ ఉన్నన్ని రోజులు పేదలకు ఆహారం పంపిణీ చేస్తాం'

రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా అమలవుతోన్న లాక్​డౌన్​ కారణంగా పేదలు, యాచకులు, అన్నార్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన కొందరు తమవంతు సహాయం చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు.

food distribution for poor people by Punyabhoomi Charitable Trust
కమలాపురంలో పుణ్యభూమి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం

కడప జిల్లా కమలాపురంలో పుణ్యభూమి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కాశీభట్ల సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో రోజుకు వెయ్యి మందికి భోజనాలు పెడుతున్నారు. లాక్​డౌన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు పేదలకు, యాచకులకు ఆహారం అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. లాక్​డౌన్ ఉన్నన్ని రోజులు భోజనం పంపిణీ చేస్తామని చెప్పారు. పేదల ఆకలి తీర్చడంలో ఉన్న సంతోషం మరే కార్యక్రమంలో ఉండదని ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details