ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

By

Published : Nov 7, 2019, 9:33 PM IST

అప్పుల బాధ తట్టుకోలేక నరసింహులు అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన కడప జిల్లా పోరుమామిళ్ల మండలం పెన్నంవారిపల్లిలో జరిగింది

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

అప్పుల బాధతో రైతు బలవన్మరణం

కడప జిల్లా పోరుమామిళ్ల మండలం పెన్నంవారిపల్లిలో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక నరసింహులు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. నరసింహులకు రెండు ఎకరాల పొలం ఉంది. అయితే వర్షాభావం కారణంగా పంట సాగు చేయలేదు. గతంలో పంట పెట్టుబడులకు సంబంధించి నాలుగు లక్షలు అప్పు చేశారు. వడ్డీ వ్యాపారులు ఒత్తిళ్లు పెరగడంతో ఫ్యానుకు ఉరేసుకొని మృతి చెందారు. పొలం పనికి వెళ్లిన భార్య లక్ష్మీదేవి వచ్చి చూసేసరికి భర్త ఉరి వేసుకుని ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details