ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 15, 2019, 3:08 PM IST

ETV Bharat / state

విద్యుత్​ తీగ తగిలి రైతు.. రెండు ఎద్దులు మృతి

కోడి కూయకముందే ఎద్దులకు కాడి కట్టి పొలం పనులకు సాగాడు ఆ రైతు. ఇంతలోనే కరెంటు తీగ రూపంలో మృత్యువు అతన్ని కబళించింది. ఈ విషాదకర ఘటన  జిల్లాలోని రాజుపాలెం మండలంలో జరిగింది.

farmer and his cows died due to current shock in kadapa
కరెంటు తీగ తగిలి చనిపోయిన రైతు

కరెంటు తీగ తగిలి చనిపోయిన రైతు

కడప జిల్లా రాజుపాలెం మండలం అర్కటవేముల గ్రామంలో విషాదం జరిగింది. పొలం పనుల కోసం ఎద్దులకు కాడికట్టి బయలుదేరిన గురివిరెడ్డి కరెంటు తీగలు తగిలి మృతి చెందాడు.ఎద్దులకు కట్టిన నాగలి ఇనుపది కావటంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. పొలంలోనే రైతు, ఎద్దులు విగతజీవులుగా పడి ఉండటం చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మధ్యే సేద్యం కోసం కొత్త‌గా గురివిరెడ్డి ఎద్దుల‌ను కొనుగోలు చేశాడు. 20 ఎక‌రాల భూమిని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మృతునికి న‌లుగురు సంతానం.

ABOUT THE AUTHOR

...view details