ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పుడు లెక్కలతో ఫసల్ బీమా దరఖాస్తులు.. తిరస్కరించిన అధికారులు - fraud in fasal bima yojana in kadapa district

తప్పుడు లెక్కలతో ఫసల్ బీమా యోజన పథకానికి కొందరూ కేటుగాళ్లు దరఖాస్తులు చేసిన ఘటన జమ్మలమడుగు నియోజకవర్గంలో బయటపడింది. పదివేలకు పైగా వచ్చిన దరఖాస్తుల్లో 2వేలకు పైగా తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తులన్నీ రైతులకు తెలియకుండానే నమోదు చేసినట్లు తెలుస్తోంది.

fasal bima yojana
fasal bima yojana

By

Published : Oct 8, 2020, 5:36 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొందరు కేటుగాళ్ళు ఫసల్ బీమా పథకాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశారు. నిడుజువ్వీ గ్రామంలోని కొందరు రైతులకు తెలియకుండానే వారి భూములకు 2019 ఖరీప్​ పంటకు సంబంధించి రూపాయి చొప్పున బీమా కట్టారు. అయితే వచ్చిన దరఖాస్తులపై అధికారులు విచారణ చేపట్టారు. మొత్తం 12,771 మంది నమోదు చేసుకోగా... వీటిలో 5825 వాటిల్లో తప్పులు దొర్లాయని మండల వ్యవసాయ అధికారి వెల్లడించారు.

వీటిపై క్షేత్ర స్థాయిలో విచారణ చేయగా... 2250 మంది తప్పుడు రికార్డు సమర్పించి బీమా కట్టినట్లు తేలిందని పేర్కొన్నారు. వీటిల్లో పట్టాలు లేని భూములతో పాటు వాగులు, గుట్టలను కూడా ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని తిరస్కరించామని వివరించారు. సరైన సమాచారమంతా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.

ABOUT THE AUTHOR

...view details