'అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి'
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పి రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. అమరావతితో పాటు మూడు ప్రాంతాలను ఒక ప్రణాళికతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మంచి రాజధానిని నిర్మించుకునే దిశగా అడుగులు వేయాలన్నారు.
ex-minister-ramsubhareddy-comments-on-amaravathi