ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 12, 2020, 9:10 AM IST

ETV Bharat / state

'ప్రాణహాని లేనప్పుడు భద్రతను ఉపసంహరించడం సరైనదే'

మాజీ మంత్రి సీ. ఆదినారాయణరెడ్డికి భద్రత తొలగింపును సమర్ధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిస్ కె . లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ex minister adinarayanareddy petetion rejected in highcourt
ఏపీ హైకోర్టు

మాజీ మంత్రి సీ. ఆదినారాయణరెడ్డికి భద్రత తొలగింపును సమర్ధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన అప్పీల్​ను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిస్ కె . లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

రాజకీయ కారణాలతో తనకు ఉన్న 1+1 భద్రతను ప్రభుత్వం తొలగించిందని పేర్కొంటూ ఆదినారాయణరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రాణహాని లేనప్పుడు భద్రతను ఉపసంహరించుకోవడం సరైనదేనని పేర్కొంటూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను ఆదినారాయణరెడ్డి ధర్మాసనం ముందు సవాలు చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది . ప్రాణహాని ఉందని భావించినప్పుడు భద్రత కోసం సంబంధిత అధికారుల్ని ఆశ్రయించేందుకు అప్పీల్ దారుకు వెసులుబాటు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details