ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇడుపులపాయ ట్రిపుల్​ ఐటీకి కొత్త సొబగులు - iiit building colours latest news

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్​రెడ్డి నిర్మించిన కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ భవనాలు నూతన శోభను సంతరించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల కు చెందిన 6 వేల మంది గ్రామీణ పేద విద్యార్థులు ఇక్కడ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు.

edupulapaya iiit building new colurs at cadapa district
ఇడుపులపాయ ఐఐఐటీ కి కొత్త సోబగులు

By

Published : Jun 23, 2020, 3:00 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డికి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కొత్తగా నిర్మించిన భవనాల రంగులు నచ్చాయి. ఆ రంగులనే ప్రాంగణంలోని తరగతి గదులకు, వసతి భవనాలకు కూడా వేయాలని సూచించారు. దీంతో మూడు కోట్ల రూపాయల వ్యయంతో ట్రిపుల్ ఐటీలోని తరగతి భవనాలకు కొత్త రంగులు వేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల కు చెందిన 6 వేల మంది గ్రామీణ పేద విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. జులై 7, 8 తేదీల్లో ముఖ్యమంత్రి ఇడుపులపాయకు వస్తుండటంతో ఇక్కడ 138 కోట్ల రూపాయలతో నిర్మించిన వివిధ రకాల ఇంజనీరింగ్ డిపార్ట్​మెంట్ గదులు, రూ. 40 కోట్లతో నిర్మించ తలపెట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆడిటోరియానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. వైఎస్ జగన్​హన్​రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రెండు సార్లు ఇడుపులపాయకు వచ్చారు. హెలికాప్టర్​లో వచే క్రమంలో పై నుంచి చూసినప్పుడు 138 కోట్ల తో నిర్మించిన ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్ గదుల రంగులు ముఖ్యమంత్రి ఆకట్టుకున్నాయని అధికారులు తెలిపారు. దీంతో అవే రంగులు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని అన్ని గదులకు వేయాలని వర్సిటీ కులపతి ఛాన్సలర్ కెసి.రెడ్ది కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు.

ఇదీ చదవండి: 4 తరాలు చూసిన కురు వృద్ధుడు: 111 ఏళ్ల వయసులో కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details