మైదుకూరులో నిర్మానుష్య వాతావరణం
జనతా కర్ఫ్యూతో కడప జిల్లా మైదుకూరులో నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో బస్టాండ్ వెలవెలబోయింది. దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు.