కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కడప ప్రజలు కర్ఫ్యూని స్వచ్ఛందంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రజలు రోడ్లపై కనిపించడం లేదు. దుకాణాలు, షాపింగ్ మాల్స్ని మూసివేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. అత్యవసరమయితే తప్పా ఎవరూ రోడ్లపై కనిపించ లేదు. బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 800 బస్సు సర్వీసులు నిలిపివేశారు.
కడపలో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ - కడపలో జనతా కర్ఫ్యూ న్యూస్
కడప జిల్లాలో ప్రజలు జనతా కర్ఫ్యూని పాటించారు. ప్రజలు ఇళ్లలోనే స్వచ్ఛందంగా కర్ఫ్యూని కొనసాగించారు. ఫలితంగా వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
![కడపలో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ due to corona Janata curfew continues at in Kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6502004-620-6502004-1584867113568.jpg)
due to corona Janata curfew continues at in Kadapa
కడపలో ప్రశాంతంగా జనతా కర్ఫ్యూ