ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దోమలు నివారించాలని సీపీఐ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన - కడప జిల్లా మైదుకూరులో సీపీఐ అర్ధనగ్న ప్రదర్శన

దోమల వ్యాప్తిని అరికట్టాలని సీపీఐ నాయకులు కడప జిల్లా మైదుకూరులోని పురపాలక కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

సీపీఐ అర్ధనగ్న ప్రదర్శన

By

Published : Sep 27, 2019, 11:11 PM IST

దోమలు నివారించాలని సీపీఐ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన

వర్షాకాలం దోమల ఉద్ధృతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా మైదుకూరులో పురపాలక సంఘం కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. స్థానికులతో కలిసి కార్యాలయం వద్దకు చేరుకున్న నేతలు పురపాలక అధికారుల తీరును తప్పుబట్టారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details