జాతీయ రహదారిపై పశువులు మరణించిన తీరు అందరిని కలచివేస్తోంది.కడపజిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలో తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఐదు ఆవులు మృతి చెందాయి.రోడ్డుమీదా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.పోలీసులు,స్థానిక ప్రజలు కలిసి మృతి చెందిన పశువులకు అంత్యక్రియలకు నిర్వహించారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.పశువుల యజమానులు వాటిని పట్టించుకోకపోవడంతో జాతీయ రహదారిపైకి చేరుతున్నాయి.ఫలితంగా తరచూ రోడ్డు ప్రమాదంలో అధికసంఖ్యలో ఆవులు మరణిస్తున్నాయి.
పాపం పాడి ఆవులు..రోడ్డుప్రమాదంలో మృత్యువాత - 5 పాడిఆవుల మృతి.
యాజమానుల నిర్లక్ల్యానికి మూగజీవాలు బలయ్యాయి. జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని 5 పశువులు చనిపోయిన ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.
cows died by accident acured in national highway at boyanapalli in kadapa district