ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 20, 2021, 8:33 AM IST

ETV Bharat / state

కోర్టు, కలెక్టర్​ ఆదేశాలున్నా.. ఇప్పటికీ స్వాధీనం కాని డీలర్​షిప్!

కడప జిల్లా కమలాపురంలోని బీడీ కాలనీలోని ప్రభుత్వ చౌక దుకాణం డీలర్​షిప్​​ మహబూబ్​ చాంద్​కు స్వాధీనం చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పటికీ సంబంధిత పరికరాలు అందచేయకపోవటంపై చాంద్​ ఎమ్మార్వోను కలిసి మాట్లాడారు.

dealership
డీలర్​షిప్​పై ఎమ్మార్వో తో మాట్లాడుతున్న మహబూబ్​ చాంద్​

కడప జిల్లా కమలాపురం పట్టణంలోని బీడీ కాలనీలో ప్రభుత్వ చౌక దుకాణం డీలర్​ మహబూబ్​ చాంద్​ను కొన్ని కారణాల దృష్ట్యా తొలగించారు. ఈ విషయంపై.. అతను కోర్టుకు వెళ్లి తిరిగి డీలర్​షిప్​ పొందేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. ఈ నెల 7న జిల్లా కలెక్టర్ పృథ్వీ తేజ్​ సైతం.. అతనికి డీలర్​షిప్​ ఇవ్వాలని ఆదేశించారు.

ప్రస్తుతం డీలర్​ గా ఉన్న వ్యక్తి నుంచి కాటా, బయోమెట్రిక్ మిషన్​ను స్వాధీనం చేసుకుని ఈ నెల 15నాటికి మహబూబ్​కు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఎమ్మార్వో కృష్ణకుమార్ తెలియచేశారు. ఇప్పటికీ పరికరాలు ఇవ్వలేదని చాంద్​ ఎమ్మార్వో వద్ద వాపోయాడు. కోర్టు, అధికారుల ఆదేశాలకు లోబడి చర్యలు తీసుకుంటామని.. 24గంటల్లో అతనికి డీలర్​షిప్​ స్వాధీనం చేస్తామని ఎమ్మార్వో చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details