ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ క్వారంటైన్ కేంద్రంలో శుభ్రతే లేదు..!

By

Published : Jun 3, 2020, 1:47 PM IST

కడప జిల్లా బద్వేల్​ నెల్లూరు రోడ్డులో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో బాధితులు ధర్నాకు దిగారు. కేంద్రంలో శుభ్రత లేదని, ఆహారం సరిగా అందించడంలేదని, కనీస అవసరాలు కూడా లేవని నిరసన తెలిపారు. కనీసం ఇంటివద్దనైనా ఉంటే... ప్రాణాలు కాపాడుకుంటామని పేర్కొన్నారు. పరిశుభ్రంగా లేని క్వారంటైన్​లో ఉంటూ..కొత్త రోగాలు తెచ్చుకోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

Corona victims  protest  at the quarantine center in badhvel
బద్వేల్​ క్వారంటైన్ కేంద్రం

కడప జిల్లా బద్వేలు నెల్లూరు రోడ్డులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో బాధితులు నిరసనకు దిగారు. మధ్యాహ్నం చేసిన కూరలే రాత్రికి వేడి చేసి ఇస్తున్నారని బాధితులు తెలిపారు. ఈ క్వారంటైన్​లో వృద్ధులు ఉన్నారని... వారు ఎలా ఉంటారని నిలదీశారు. కనీస సౌకర్యాలు అందించడంలేదని, శానిటైజర్లు లేవని తెలిపారు. ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉంటే కొత్త రోగాలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గృహ నిర్బంధంలో ఉంటే ప్రాణాలను కాపాడుకోవచ్చని అంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details