ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 23, 2020, 10:53 PM IST

ETV Bharat / state

వరుడికి కరోనా.. పెళ్లింట కలకలం

కడప జిల్లా కొత్త మాధవరం గ్రామంలో పెళ్లింట కరోనా కలకలం రేపింది. వరుడికి కరోనా పాజిటివ్ రావటంతో వివాహ కార్యక్రమానికి హాజరైన వారిలో ఆందోళన నెలకొంది.

corona positive cases registered on madhavaram kadapa district
పెళ్లింట కరోనా కలకలం.. వరుడికి కరోనా పాజిటివ్

కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరం గ్రామంలో పెళ్లి కుమారుడికి కరోనా సోకింది. మూడు రోజుల క్రితం వరుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా... గురువారం ఫలితాలు వచ్చాయి. వివాహం అనంతరం బంధువులు నెల్లూరు జిల్లా గూడూరు వెళ్లారు.

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పెళ్లి కుమారునికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు నుంచి వెంటనే తిరిగి రావాలని అధికారులు ఫోన్ చేయటంతో పెళ్లింట్లో ఆందోళన నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details