ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 17, 2021, 4:50 PM IST

ETV Bharat / state

అమానుషం : కొవిడ్ రోగి మృతి.. అంబులెన్స్ దించేసిన డ్రైవర్

కరోనా బాధితుడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్సులో మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో 108 అంబులెన్సు డ్రైవర్ దేహాన్ని కిందకి దించేశారు. అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.

అమానుషం : కొవిడ్ రోగి మృతి.. అంబులెన్స్ దించేసిన డ్రైవర్
అమానుషం : కొవిడ్ రోగి మృతి.. అంబులెన్స్ దించేసిన డ్రైవర్

కరోనా బాధితుడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందిన ఘటన కడప జిల్లా అట్లూరులో చోటు చేసుకుంది. బద్వేల్ నుంచి అంబులెన్సులో తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి మృతదేహాన్ని దించేశారు.

అనంతరం డ్రైవర్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అట్లూరు ఠాణాకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రైవేట్ వాహనంలో మృత దేహాన్ని స్వగ్రామానికి పంపించారు. మృతుడు బద్వేల్​లోని సురేంద్ర నగర్​కు చెందిన జోగేశ్వర్​గా పోలీసులు గుర్తించారు.

ఇవీ చూడండి :రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details