ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంబయి నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ - rayachoti latest corona news

రాయచోటిలో ముంబయి నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. పట్టణ పరిధిలో ఇది నాలుగో కరోనా పాజిటివ్​ కేసు. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించి అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

containment zone in rayachoti town in 12th ward monarch street
మోనార్క్​ వీధిలో కంటైన్మెంట్​ జోన్​ ఏర్పాటు

By

Published : Jun 29, 2020, 11:32 AM IST

కడప జిల్లా రాయచోటి పురపాలికలో 12 వ వార్డు మెనార్క్​ వీధిలో ముంబయి నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్​ సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారు. బాధితుడి ఇంటి నుంచి 200 మీటర్ల వరకు కంటైన్మెంట్​ జోన్​గా అధికారులు ప్రకటించారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షల నిమిత్తం కడప ఫాతిమా మెడికల్​ కళాశాలకు తరలించారు. ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తహసీల్దార్​ సుబ్రహ్మణ్యం రెడ్డి, కమిషనర్​ రాంబాబు, సీఐ రాజు, వైద్యాధికారులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details