రెండేళ్లలోనే వైకాపా ప్రజల విశ్వాసం కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్కు చిత్తశుద్ధి ఉంటే గతంలో జరిగిన ఏకగ్రీవాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరిగినా పూర్తి బాధ్యత రమేష్ కుమార్దేనని తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం..