ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని రద్దు చేయాలి' - thulasi reddy latest news

కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ నేత తులసి రెడ్డి మీడియా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఇంటివద్దకే రేషన్ పథకంతో లబ్ధిదారులే కాకుండా... వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

congress leader thulasi reddy fire on ycp schemes
కాంగ్రెస్ నేత తులసి రెడ్డి

By

Published : Feb 6, 2021, 8:37 PM IST

ఇంటి వద్దకు రేషన్ పథకం ఒక ప్రహసనంగా తయారైందని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రజల మీద ఏడు వందల కోట్ల రూపాయల అదనపు భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకంతో వాహనదారులే కాకుండా.. లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ బియ్యం పథకాన్ని రద్దు చేసి... పాత పద్ధతిలో రేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details