ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ... 8 మందికి గాయాలు - కడపలో వైకాపా వర్గీయుల ఘర్షణ

కడప బి.కోడూరు మండలం పాయలకుంట్లలో వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామ సచివాలయం శంకుస్థాపన విషయంలో గొడవ జరిగింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి.

conflict between ysrcp groups
వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ

By

Published : May 27, 2020, 3:19 PM IST

కడప జిల్లా బి. కోడూరు మండలం పాయలకుంటలో వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామ సచివాలయం శంకుస్థాపన విషయంలో... ఆ పార్టీలో నెలకొన్న విభేదాలు భగ్గుమన్నాయి. రామకృష్ణారెడ్డి, డి.యోగానంద్​రెడ్డి వర్గీయుల పరస్పరం రాళ్లు రువ్వు కోవడంతో ఎనిమిది మందికి గాయపడ్డారు. వీరిని బద్వేలు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య గ్రామ సచివాలయం శంకుస్థాపన కార్యక్రమానికి అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details