ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం: సీఎం జగన్ - cm jagn inaugrates ct scan device at kadapa virtually

ప్రజల ఆరోగ్య సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) లో రూ.3.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన సీటీ స్కానింగ్ పరికరాన్ని ఆయన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.

cm jagan
cm jagan

By

Published : May 19, 2021, 10:14 PM IST



ప్రజల ఆరోగ్య సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో భాగంగా.. వ్యాధి నిర్ధరణలో నాణ్యమైన ఫలితాలను ఖచ్చితంగా అందించడం కోసం.. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) లో రూ.3.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన సీటీ స్కానింగ్ పరికరాన్ని ఆయన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో పేద ప్రజలకు మెరుగైన వ్యాధి నిర్ధరణ కోసం.. కడప జీజీహెచ్​లో సీటీ పరికరాన్ని, ఒంగోలు, శ్రీకాకుళం, నెల్లూరులో .. సీటీ -ఎంఆర్ఐ పరికరాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని, అందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అన్నారు.

ముఖ్యమంత్రి వైద్యారోగ్య రంగానికి పెద్ద పీట వేశారు: అంజద్ భాషా

‘సీఎం జగన్ తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అన్నింటినీ తీరుస్తూ.. మాట తప్పని నిజమైన నాయకుడిగా వెలుగొందుతున్నారని ఉపముఖ్యమంత్రి అంజద్ భాషా అన్నారు. ముఖ్యమంత్రి వైద్యారోగ్య రంగానికి పెద్ద పీట వేశారన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు నిత్యం కృషిచేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:

4 జిల్లా ఆస్పత్రుల్లో.. సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ యంత్రాలు ప్రారంభించిన సీఎం

ABOUT THE AUTHOR

...view details