ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల సంక్షేమం కోసం సీఎం పెద్దపీట వేస్తున్నారు: అంబటి కృష్ణారెడ్డి - cm jagan is laying more efforts on welfare of farmers

రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. అధికారులు మాత్రం రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయటం లేదన్నారు. కడప జిల్లాలో శనగ సంచుల టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నివేదికను సీఎంకు అందిచాలని అధికారులకు సూచించారు.

cm jagan is laying more efforts on welfare of farmers says  Agriculture Department Advisor Ambati Krishnareddy
రైతుల సంక్షేమం కోసం సీఎం పెద్దపీట వేస్తున్నారు: అంబటి కృష్ణారెడ్డి

By

Published : Oct 31, 2020, 6:47 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనునిత్యం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని... రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. అధికారులు మాత్రం రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం అందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కడప జిల్లాకు సంబంధించి సుమారు రూ. కోటిన్నర విలువగల 8లక్షల శనగ సంచుల విషయంలో గోల్ మాల్ జరిగిందన్నారు. జిల్లాకు ఎనిమిది లక్షల సంచులు అవసరం కాగా కేవలం వేల సంఖ్యలో సరఫరా చేసి... అధికారులు చేతులు దులుపుకున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై అధికారులు స్పందించాలన్నారు. రైతుల విషయంలో సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. శనగ సంచుల టెండర్ల విషయంలో జరిగిన అవకతవకలను అధికారులు విచారించి వాటిపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేయాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details