ప్రొద్దుటూరులో తెదేపా-వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ - Kadapa District Latest News
కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా-వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఆరో వార్డులోని పోలింగ్ కేంద్రంలో తెదేపా నాయకులు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని వైకాపా నేతలు ఆరోపణలు చేశారు. ఇరు పార్టీల మధ్య వివాదం చెలరేగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. డీఎస్పీ ప్రసాదరావు, పోలీసులు సిబ్బంది ఇరువర్గాలను చదరగొట్టారు. వివాదం సద్దుమణిగింది.
ప్రొద్దుటూరులో తెదేపా-వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ