ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 28, 2020, 12:49 PM IST

ETV Bharat / state

కంపచెట్లపాలైన పసికందు!

గోప‌వ‌రం పంచాయ‌తీ యానాది కాల‌నీలో కంపచెట్ల‌లో శిశువు ఉన్న‌ట్లు స్థానికంగా ఉండే ఓ మ‌హిళ గుర్తించింది. దీంతో ఆ ప‌సి కూన‌ను రాత్రి ఇంట్లోనే ఉంచుకుని మరుసటి రోజు ఉద‌యాన్నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. ప్ర‌స్తుతం చిన్నారి ఆరోగ్యం మెరుగ్గానే ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

child found in road side at kadapa district
పాపం పసికూన

తల్లి ఒడిలో ఉండాల్సిన శిశువు కంపచెట్లలో దర్శనమిచ్చాడు. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కంపచెట్లలో పడేసి వెళ్లారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని గోపవరం పంచాయతీ యానాదికాలనీలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

కాసేపటికి శిశువు ఏడుపును గుర్తించిన ఓ మహిళ.. పసికూనను చేరదీసింది. సోమవారం ఉదయమే పోలీసులకు సమాచారమిచ్చింది. శిశువును ఆస్పత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details