మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(viveka murder case)కు సంబంధించి.. కడప కేంద్ర కారాగారంలో నెల రోజుల నుంచి సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా శుక్రవారం వివేకానంద రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డితో పాటు పులివెందులకు చెందిన ఉమామహేశ్వర్, మాజీ డ్రైవర్లు దస్తగిరి, ప్రసాద్తో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు విచారించారు. వీరి నుంచి సీబీఐ అధికారులు పలు కీలక అంశాలను రాబట్టారు. కేసు విచారణ మొత్తం అతికొద్దిమంది చుట్టే తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను అధికారులు నమోదు చేసుకున్నారు. విచారణ మొత్తం అత్యంత గోప్యంగా కొనసాగుతోంది.
ఎర్ర గంగిరెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు