మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొదటి రోజు కడప విచారణ చేపట్టగా.. రెండు రోజైన ఆదివారం ఏడుగురు విచారణ అధికారులు వివేకా హత్యకు గురైన పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి నిశితంగా పరిశీలించారు. మూడోరోజు కూడా సీబీఐ బృందం పులివెందుల చేరుకుంది. స్థానిక డీఎస్పీ వాసుదేవన్ కార్యాలయంలో కేసు వివరాలపై ఆరా తీసింది. పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి పరిశీలించనుంది సీబీఐ బృందం. మరోవైపు అధికారులను కలిసేందుకు హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకున్నారు వివేకా కుమార్తె సునీత.
వివేకా హత్య కేసు: పులివెందులకు సీబీఐ బృందం - వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వార్తలు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. మూడోరోజు పులివెందుల చేరుకుంది సీబీఐ బృందం. పట్టణంలోని వివేకా ఇంటిని పరిశీలించనుంది.
vivekananda reddy