ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 28, 2020, 4:46 PM IST

ETV Bharat / state

వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆర్థిక లావాదేవీల కోణంలోనే అధికారులు ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

cbi enquiry in YS vivekanandhareddy murder case at kadapa district
వివేకా హత్య కేసులో కొనసాగుతోన్న సీబీఐ విచారణ

వివేకా హత్య కేసులో కొనసాగుతోన్న సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. 16వ రోజు కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాతో సంబంధం ఉన్న వ్యక్తిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్థిక లావాదేవీల కోణంలోనే సీబీఐ ఎక్కువగా దృష్టి సారించి విచారణ చేస్తోంది. మున్నాతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో.. ఎవరెవరు అప్పులు ఇచ్చారో అన్నదానిపై కూపీ లాగుతున్నారు. ఆదివారం కడపకు చెందిన ముగ్గురు చెప్పుల షాపు డీలర్లను కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేసింది.

ABOUT THE AUTHOR

...view details