ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వేంపల్లిలో పట్టపగలే బైక్​ చోరీ ... సీసీ టీవీ పుటేజీలో రికార్డైన దృశ్యం

By

Published : Dec 31, 2020, 1:33 PM IST

పట్టపగలే బైక్​ను దొంగిలించిన ఘటన కడప జిల్లా వేంపల్లిలో చోటుచేసుకుంది. పార్కింగ్​ చేసిన కొద్ది నిమిషాల్లోనే గుర్తు తెలియని వ్యక్తి ద్వి చక్ర వాహనాన్ని దొంగిలించాడు.

byke theft
వేంపల్లిలో పట్టపగలే బైక్​ చోరీ

బైక్​ చోరీ దృశ్యాలు

కడప జిల్లా వేంపల్లి పట్టణంలో మోటార్ బైక్ చోరీకి గురైంది. పులివెందుల రోడ్డులో పార్కింగ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే బైక్ మాయమైందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఘటన ఈ నెల 28 తేదీన జరిగింది. డూప్లికేట్​ తాళాన్ని ఉపయోగించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యం సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీటీవీ రికార్డు కాగా... విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించి వేంపల్లి పోలీస్టేషన్​లో బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:ప్రొద్దుటూరు: తెదేపా నేత సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న లోకేశ్

ABOUT THE AUTHOR

...view details