కడప జిల్లా వేంపల్లి పట్టణంలో మోటార్ బైక్ చోరీకి గురైంది. పులివెందుల రోడ్డులో పార్కింగ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే బైక్ మాయమైందని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఘటన ఈ నెల 28 తేదీన జరిగింది. డూప్లికేట్ తాళాన్ని ఉపయోగించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యం సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీటీవీ రికార్డు కాగా... విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వేంపల్లిలో పట్టపగలే బైక్ చోరీ ... సీసీ టీవీ పుటేజీలో రికార్డైన దృశ్యం - వేంపల్లిలో బైక్ దొంగతనం
పట్టపగలే బైక్ను దొంగిలించిన ఘటన కడప జిల్లా వేంపల్లిలో చోటుచేసుకుంది. పార్కింగ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే గుర్తు తెలియని వ్యక్తి ద్వి చక్ర వాహనాన్ని దొంగిలించాడు.

వేంపల్లిలో పట్టపగలే బైక్ చోరీ
బైక్ చోరీ దృశ్యాలు
ఈ ఘటనకు సంబంధించి వేంపల్లి పోలీస్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:ప్రొద్దుటూరు: తెదేపా నేత సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న లోకేశ్