కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 3,253 ఉన్నాయి. బాల, బాలికలు 2.63 లక్షల మంది ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం లాక్డౌన్ అమలు చేస్తున్నారు. బడులు మూతపడ్డాయి. విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. పునఃప్రారంభంలో ఆలస్యమైంది. ఇప్పటికే దూరదర్శన్, సప్తగిరి, యూట్యూబ్ తదితర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే విద్యా వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా పాఠ్యాంశాలపై నైపుణ్యం ఉన్న బోధకులు, నిపుణుల సలహాలు, సూచనలను ప్రసారం చేస్తున్నారు. అవగాహన కల్పించే యత్నం జరుగుతోంది.
రేపటి పౌరుల్లో మరింత పఠనాసక్తి పెంపొందించాలని కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో ‘పుస్తక నేస్తం’ పేరిట మరో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం మైసూరులోని భారతీయ భాషాధ్యయన కేంద్రం నుంచి పుస్తకాలను తెప్పించారు. సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చిన వీరభద్రుడు ఇప్పటికే మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అన్ని బడులకు ఇవ్వడం లేదు.
ఇప్పుడు 2,729 సరస్వతీ నిలయాలకు ఇవ్వాలని తెప్పించారు. ప్రాథమిక 2,098, ప్రాథమికోన్నత పాఠశాలలు 194కు సరఫరా చేయాలని అనుమతిచ్చారు. ఒక్కో బడికి 30 పుస్తకాలు ఇస్తున్నారు. సెకండరీ విద్యలో ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, జూనియర్ కళాశాలలు కలిపి 437కు సరఫరా చేస్తారు. ఈ విద్యాలయాలకు 50 చొప్పున ఇస్తారు. ఇందులో తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉన్నాయి. 1-10వ తరగతి వరకు ఉన్నచోట 82 అందిస్తారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విభాగంలో 73,344, సెకండరీ విద్యార్థుల కోసం 21,850 వచ్చాయి. ఎస్ఎస్ఏ ద్వారా ఇప్పటికే మండలాల ఎంఈవో కార్యాలయాలు, మండల రిసోర్సు కేంద్రాలకు పంపించారు. అక్కడి నుంచి ఆయా ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇవ్వనున్నారు.
ఏం చేస్తారంటే..