ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కమలాపురం మండలంలో రక్తదాన శిబిరం - కమలాపురం మండలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

వందమందితో దినేష్​ అనే యువకుడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించాడు. కమలాపురం మండలం పెద చెప్పలి గ్రామంలో శిబిరం ఏర్పాటు చేశాడు. కమలాపురం తెదేపా ఇంఛార్జి​ పుత్తా నరసింహారెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

కమలాపురం మండలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

By

Published : Nov 17, 2019, 8:25 PM IST

కమలాపురం మండలంలో రక్తదాన శిబిరం

కడప జిల్లా కమలాపురం మండలంలో... దినేష్​ అనే యువకుడు సుమారు 100 మందితో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. పెద్ద చెప్పలి హైస్కూల్​ ఆవరణలో సేవ్​లైఫ్​ టీం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కమలాపురం నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి​ పుత్తా నరసింహారెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఇలాంటి మంచి పనిని ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. దినేష్​ను అభినందించారు. పలు కారణాలతో పేదవారు రక్తం లేక మరణిస్తున్నారని... వారిని చూసి చలించి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశానని దినేష్ చెప్పాడు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details