ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాని మోదీ ప్రజలు మెచ్చిన నాయకుడు: సత్యకుమార్ - రాష్ట్రంలో భాజపా సంకల్ప యాత్ర న్యూస్

ప్రధాని మోదీ ప్రజలు మెచ్చిన నాయకుడనీ... ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదరాభిమానాలు చూరగొన్నారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. కడపలో గాంధీ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

భాజపా సంకల్ప యాత్ర

By

Published : Oct 31, 2019, 5:15 PM IST

భాజపా సంకల్ప యాత్ర

మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్​లకు నిజమైన వారసుడు ప్రధాని నరేంద్రమోదీ అని... భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. కడపలో గాంధీ సంకల్పయాత్ర ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సత్యకుమార్ మాట్లాడారు. గాంధీపేరు అరువు తెచ్చుకొని గతంలో పాలించిన పాలకులు... దేశాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. మోదీ ప్రజలు మెచ్చిన నాయకుడనీ... ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదరాభిమానాలు చూరగొన్నారని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details