కడప జిల్లా ప్రొద్దుటూరులో పారిశుద్ధ్య లోపంపై భాజపా ఆందోళనకు దిగింది.ఆ పార్టీ శ్రేణులు మురికి కాలువలో కూర్చోని నిరసన తెలిపారు.చెత్తను తొలగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలంటూ డిమాండ్ చేశారు.పెరుకుపోయిన చెత్తతో దోమలు వ్యాప్తి చెంది..పిల్లలు,పెద్దలు విషజ్వరాల బారిన పడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.ఈ సమస్యలపై ఇప్పటికే అనేక సార్లు వినతిపత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేత బాలచంద్రారెడ్డి మండిపడ్డారు.
పారిశుద్ద్యలోపంపై భాజపా వినూత్న నిరసన - ప్రొద్దుటూరు ప్రధాన కాలువపై భాజపా నేత నిరసన
ప్రొద్దుటూరులోని పారిశుద్ద్య లోపంపై భాజపా శ్రేణులు వినూత్న నిరసనకు దిగారు. భాజపా నేత కొవ్వూరు బాలచంద్రారెడ్డి మురుగు కాలవపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. మురుగు కాల్వలో పేరుకుపోయిన చెత్తను తొలగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలంటూ డిమాండ్ చేశారు.
![పారిశుద్ద్యలోపంపై భాజపా వినూత్న నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4746022-174-4746022-1571045734917.jpg)
ప్రొద్దుటూరు ప్రధాన కాలువ పారిశుద్ధ్యంపై భాజపా నేత వినూత్న నిరసన
ప్రొద్దుటూరు ప్రధాన కాలువ పారిశుద్ధ్యంపై భాజపా నేత వినూత్న నిరసన
ఇదీ చదవండి :