ఎంపీ విజయసాయిరెడ్డి... కన్నా లక్ష్మీనారాయణకు క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపణలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆరోపించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందన్నారు.
వైకాపా ఆగడాలు పెరిగిపోతున్నాయి: బండి ప్రభాకర్ - వైకాపాపై భాజాపా ఆగ్రహం
వైకాపా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేయడంపై బండి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
![వైకాపా ఆగడాలు పెరిగిపోతున్నాయి: బండి ప్రభాకర్ bjp fires on ysrcp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6877739-515-6877739-1587449892762.jpg)
వైకాపాపై బండి ప్రభాకర్ ఆగ్రహం