ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'స్వామివారి ఆస్తుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి'

తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా భాజాపా, జనసేన నేతలు ఉపవాస దీక్షలు చేపట్టారు. తితిదే భూముల విక్రయ, లీజ్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

By

Published : May 27, 2020, 10:12 AM IST

Published : May 27, 2020, 10:12 AM IST

ETV Bharat / state

'స్వామివారి ఆస్తుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి'

bjp-and-janasena
bjp-and-janasena

రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నేతలు తితిదే తీరుపై నిరసన ప్రదర్శనలు చేశారు. దేవాలయ ఆస్తుల అమ్మకానికి చేస్తున్న ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లాలో...

హిందూ దేవాలయాల ఆస్తులను కాపాడాలని కోరుతూ భాజపా నేతలు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఉపవాస దీక్షలు చేపట్టారు. విశాఖ గ్రామీణ జిల్లా భాజపా అధ్యక్షులు డాక్టర్ జి. వి సత్యనారాయణ నిరసన తెలిపారు. కశింకోట మండలంలో పొన్నగంటి అప్పారావు పార్టీ నాయకులతో కలిసి దీక్ష చేశారు.

కడప జిల్లాలో..

తితిదేకు సంబంధించిన ఆస్తుల విక్రయ, లీజ్ విధానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని భాజాపా కడప అసెంబ్లీ నియోజకవర్గ నాయకుడు కందుల శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. కడప పార్టీ కార్యాలయంలో భౌతిక దూరం పాటిస్తూ దీక్షలు చేపట్టారు. రాజంపేటలో జనసేన నేతలు నిరసన చేపట్టారు. దేవాలయాల ఆస్తులను కాపాడాలని జనసేన నేత మలిశెట్టి వెంకటరమణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రత్యేక చట్టం కావాలని కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ బాధ్యుడు రమేష్ నాయుడు , జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ రాజు డిమాండ్ చేశారు. మౌన దీక్ష చేపట్టారు.

ప్రకాశం జిల్లాలో..

కనిగిరిలో భాజాపా, జనసేన నేతలు దీక్షలు చేశారు. తితిదే భూముల విక్రయం రద్దు చేయాలని..ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీవారి భూములను విక్రయించడమంటే భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని ఆయన వారు మండిపడ్డారు. దాతలు స్వామివారి కోసం ఇచ్చిన ఆస్తులను, భూములను అమ్మే హక్కు పాలకమండలికి లేదని స్పష్టం చేశారు. ఏడాది జగన్ పాలనలో ప్రజలకు చేసిన మేలు ఏమిలేదనీ..వెంకన్న భూములకు, ఆస్తులకు శఠగోపం పెట్టాడని నాయకులు ధ్వజమొత్తారు.

ఒంగోలులో తితిదే భూముల వేలంపై భాజాపా, జనసేన నేతలు ధర్నా చేశారు. దాతలు ఇచ్చిన ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం... వాటిని విక్రయిస్తామని అనడం దారుణమని భాజాపా నేత శ్రీనివాసులు మండిపడ్డారు. చిన్నగంజాంలో భాజపా, జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆలయాల జోలికి రావద్దని... భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని నాయకులు హెచ్చరించారు.

అద్దంకిలో భాజాపా, జనసేన నాయకులు ఉపవాస దీక్ష చేశారు. భాజపా నాయకుడు బంగారుబాబు, జనసేన అద్దంకి నియోజకవర్గ నాయకుడు గోరంట్ల సాయి, కార్యకర్తలు హాజరయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..

జంగారెడ్డిగూడెంలో భాజపా నాయకులు తమ గృహాల్లో మౌన దీక్షలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆలయ భూములు విక్రయించే హక్కు పాలకమండలికి లేదన్నారు. నరసాపురంలో భాజపా నాయకుడు కంచర్ల నాగేశ్వరరావు దీక్ష చేశారు. సీనియర్ నాయకుడు డాక్టర్. ఇలపకుర్తి ప్రకాష్ హాజరయ్యారు. భాజపా మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి శరణాలు, మారుతీ రాణి.. ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఉపవాస దీక్ష చేపట్టారు. స్థానిక శ్రీ శ్రీనివాస రైతు భవనంలో భౌతిక దూరం పాటిస్తూ దీక్ష చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లాలో...

తూర్పు గోదావరి జిల్లా రాజోలులో భాజాపా నేతలు ఉపవాస దీక్ష చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు సింహాచలం తదితర దేవాలయాల అసలు పరిరక్షించాలని మానేపల్లి అయ్యాజీ డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా...

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు అమ్మాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో భాజపానేత గుడిసె దేవానంద్ ఉపవాస దీక్ష చేపట్టారు. భాజపా నాయకులు, ప్రజా సంఘాల నిరసనతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం, భవిష్యత్తులో కూడా విక్రయించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ ప్రభుత్వం ఆలయాలతో పాటు, ప్రభుత్వ భూములను ఇష్టానుసారం అమ్ముతోందని దేవానంద్ విమర్శించారు.

ఇదీ చూడండి:

'వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details