కడప జిల్లా కమలాపురం డ్రైనేజీ కాంట్రాక్టు పనుల నిమిత్తం బీహార్కు చెందిన వలసకులీలు 34 రోజుల క్రితం జిల్లాకు వచ్చారు. లాక్డౌన్ కారణంగా తినేందుకు కూడా ఏమీ లేక.. ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. పనులు చేసుకోవాలన్నా... కరోన భయంతో పోలేకపోతున్నామని అన్నారు.
బిహార్లో ఉన్న తమ కుటుంబాల వద్దకు చేర్చాలంటూ.. ఆ 34 మంది వలస కూలీలు తహసీల్దార్, పోలీసులను వేడుకున్నామని చెప్పారు. వారు 4 రోజుల్లో మిమ్మల్ని పంపడానికి పై అధికారులతో మాట్లాడతామని చెప్పారన్నారు. త్వరగా తమను బీహార్ కు పంపించాలని కోరుతున్నారు.