ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రహదారిపై చిత్రం.. కరోనాపై సందేశం

By

Published : Mar 30, 2020, 3:37 PM IST

మైదుకూరు యువకుడు.. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూత్నంగా ప్రయత్నించాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు.

art about corona virus on roads in kadapa district
రహదారిపై కరోనా బొమ్మ

రహదారిపై కరోనా బొమ్మ

కరోనాపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు కడప జిల్లా మైదుకూరుకు చెందిన ప్రభాకర్.. చిత్రలేఖనాన్ని ఎంచుకున్నాడు. అది కాగితం మీద కాదు. అలా అని ఇసుకపై వేయలేదు. మార్కెట్​ కూడలి రహదారిపై​ కరోనా చిత్రాన్ని గీశాడు. ఈ వైరస్​ దరిచేరకుండా ఉండాల్సిన ఆవశ్యకతను అందరికీ వివరించాడు. 'ఇంట్లోనే ఉందాం కరోనాను తరిమేద్దాం' అంటూ తెలుగు, ఆంగ్ల భాషల్లో సందేశాన్ని ఇచ్చాడు. కరోనా నివారణ దిశగా వెలకట్టలేని కృషి చేస్తున్న వైద్యులకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

ABOUT THE AUTHOR

...view details