ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 9, 2020, 7:10 PM IST

ETV Bharat / state

భార్యను హత్యను చేసిన వ్యక్తి అరెస్ట్

కడప జిల్లా కాశినాయన మండలంలో భార్యను హత్య చేసిన అయ్యలూరి పుల్లారెడ్డిని పోరుమామిళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యపై అనుమానంతో తరచూ ఘర్షణ పడేవాడని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

భార్యను హత్యను చేసిన నిందితుడి అరెస్ట్
భార్యను హత్యను చేసిన నిందితుడి అరెస్ట్

కడప జిల్లాలో అతికిరాతంగా భార్యను హత్య చేసిన చిన్నాయపల్లెకు చెందిన నిందితుడు అయ్యలూరి పుల్లారెడ్డిని పోరుమామిళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య నారాయణమ్మపై అనుమానంతో పథకం ప్రకారమే హత్య చేసి, ఆపై సంచిలో శవాన్ని తీసుకుని పొలంలోని కంప చెట్లలో పారవేశాడని మైదుకూరు డిఎస్పీ విజయకుమార్ సమావేశంలో తెలిపారు.

ఇద్దరు కుమార్తెలకు వివాహమయిందని, కుమారుడు హైదరాబాద్​లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు వివరించారు. భార్యపై అనుమానంతో తరచూ ఘర్షణ పడేవాడని విచారణలో తేలినట్లు తెలిపారు. కుమారుడు వీరమోహన్​రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోరుమామిళ్ల పోలీసులు నిందితుడైన భర్త పుల్లారెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details