Tulasi Reddy Comments: జగన్, అబద్ధాలు కవల పిల్లలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95శాతం అమలు చేశామని.. కాబట్టి 175 సీట్లకు గాను 175 గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నవరత్నాలకే దిక్కు లేదనీ.. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం.. గిట్టుబాటు ధరకు గారంటీ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కడప జిల్లా వేంపల్లెలోని తులసి రెడ్డి స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొనేవారు లేక, గిట్టుబాటు ధర లభించక టమాట, ఉల్లి తదితర పంటలను రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారనీ.. వైద్యఆరోగ్య శాఖలో 3200 మంది పారామెడికల్ కాంట్రాక్ట్ సిబ్బంది, ఆర్టీపీపీలో 1600 మంది కాంట్రాక్ట్ సిబ్బంది.. క్రమబద్ధీకరణ చేయాలని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
"పులివెందుల ప్రజలు జగన్కు ఎందుకు ఓటు వేయాలి" - కడప జిల్లా
Tulasi Reddy: మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 95శాతం అమలు చేశామని.. కాబట్టి 175 సీట్లకు గాను 175 గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఏపీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి తెలిపారు.
!["పులివెందుల ప్రజలు జగన్కు ఎందుకు ఓటు వేయాలి" N Tulasi Reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16944331-102-16944331-1668590534249.jpg)
25 లక్షల ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో పేర్కొని.. 25 వేల ఇళ్లు కూడా కట్టించలేదనీ.. ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీ అయ్యిందనీ.. జలయజ్ఞం కంటికి కనిపించడం లేదన్నారు. మద్యపాన నిషేధం, మద్యపాన బానిసగా, జగనన్న తాగండి - ఊగండి పథకంగా తయారయిందనీ ఆరోపించారు. సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డికి, చెల్లెలు సునీత రెడ్డికి, సొంత చెల్లెలు షర్మిల రెడ్డికి.. న్యాయం చేయని ముఖ్యమంత్రి జగన్కు.. పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. కడప జిల్లా స్టీల్ ప్లాంట్పై మాట తప్పిన జగన్.. పార్టీకి కడప జిల్లా ప్రజలు ఎందుకు ఓటు వేయాలనీ తులసి రెడ్డి నిలదీశారు.
ఇవీ చదవండి: