కడప స్టీల్ప్లాంట్కు ఇనుప ఖనిజం సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం... నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒప్పందం చేసుకోనుంది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్కు అవసరమైన ముడి ఇనుము ఖనిజం కోసం ఈ నెల 18న ఓ అంగీకారానికి రానుంది.కడప స్టీల్ప్లాంట్కు ఈనెల 23న సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపనకు ముందే ఎన్ఎండీసీతో ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకోనుంది. ఛత్తీస్గఢ్లోని ఎన్ఎండీసీ గనుల నుంచి ముడి ఇనుము సరఫరా చేసేలా చూడాలని సర్కారు భావిస్తోంది.
3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం